
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ రూపొందించిన 'ఆర్య' సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో 'కుట్టి' పేరుతో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జెమినీ ల్యాబ్ వారు రూపొందించనున్న ఈ చిత్రాన్ని లవ్ టుడే(తెలుగులో సుస్వాగతం) దర్శకుడు బాలశేఖరన్ డైరక్ట్ చేయనున్నారని సమాచారం. తెలుగులో అల్లు అర్జున్ చేసిన పాత్రను రజనీకాంత్ అల్లుడు ధనుష్ చేయనున్నాడు. ఇక హీరోయిన్ గా శ్రియ కమిట్ అయ్యింది. ఇంతకుముందు కూడా ధనుష్ తెలుగులో హిట్టయిన ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే చిత్రం రీమేక్ లో నటించాడు. యారాడి నీ మోహిని పేరుతో రీమేక్ అయిన ఈ తమిళ చిత్రంలో ఇక్కడ వెంకటేష్ చేసిన పాత్రను ధనుష్ చేసాడు..త్రిష పాత్రను నయనతార చేసారు. అది ఘనవిజయం సాధించటంతో ఆ ఉత్సాహంతో ఈ చిత్రానికి ధనుష్ ఓకె చెప్పినట్లు సమాచారం. ఇంతకుముందు తమిళ హీరో విజయ్ తెలుగు సినిమా రీమేకల్లో చేయటానికి ఉత్సాహాన్ని చూపేవారు. ఇప్పడు ఆ లిస్టులో ధనుష్ కూడా చేరారు
No comments:
Post a Comment